అత్యంత ప్రమాదకరమైన గాజు పెంకులు తగిలి గాయమైతేనే ఎంతో భయపడుతాం. శరీరంలో గుచ్చుకుపోతే పాయిజన్ అవుంటుందని ఆందోళన వ్యక్తం చేస్తాం. అలాంటి గాజు ముక్కలను నోట్లో వేసుకుని చిప్స్ లా కరకరా నమిలి మింగుతున్నాడు ఓ లాయర్. గాజు ముక్కలను మింగితే ప్రమాదామని తెలిసి కూడా రాజస్థాన్ కు చెందిన ఓ లాయర్ లాగిస్తున్నారు. రాజస్థాన్ దిందోరికి చెందిన న్యాయవాది దయారాం సాహూకు గాజు ముక్కలు తినే అలవాటు ఉంది.
ప్రస్తుతం దాన్ని మానేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. గాజు ముక్కలను ఓ పల్లెంలో పెట్టుకునే సాహూ, చిప్స్ తరహాలో వాటిని నమిలి కరకరా మింగేస్తారు. గత 40-45 సంవత్సరాలుగా ఇదే తంతు సాగుతోంది. అన్నట్లు ఇలా గాజు ముక్కలు తినడం కారణంగా సాహూకు ఒక్కసారి కూడా అనారోగ్యం పాలు కాకపోవడం విశేషం.
టీడీపీకి రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే ముఖ్యం: మంత్రి కన్నబాబు