ఉస్మానియా కాలేజీ విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్రం `జార్జిరెడ్డి`, సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని `యు/ఎ` సర్టిఫికేట్ను పొందింది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఇక ఈ నెల 22న విడుదల కానుండటం లాంఛనంగా మారింది. `వంగవీటి` ఫేమ్ సందీప్ మాధవ్(సాండీ) టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని `దళం` ఫేమ్ జీవన్ రెడ్డి డైరెక్ట్ చేశారు.
రీసెంట్గా ఈ సినిమాను విడుదల చేయవద్దంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) నిరసనను వ్యక్తం చేసింది. తమ సంఘానికి చెందిన విద్యార్థులను రౌడీలుగా చూపిస్తే సహించబోమని తెలిపారు. ఈ నేపథ్యంలో సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది.