వరుణ్ తేజ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించిన “వాల్మీకి” సినిమా టైటిల్ మారింది. సినిమా టైటిల్ను “గద్దలకొండ గణేష్”గా మార్చారు. “వాల్మీకి” టైటిల్ అభ్యంతరకరంగా ఉందని బోయ సామాజిక వర్గానికి చెందిన బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ చిత్రంలో అధర్వ మురళి ముఖ్య పాత్ర పోషించారు. పూజా హెగ్డే కథానాయికగా నటించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించారు. ఇప్పటికే “గద్దలకొండ గణేష్” ప్రీమియర్ షోలు యూఎస్లో ప్రారంభమయ్యాయి. ఇక సినిమా ప్రీమియర్ షో టాక్ ఎలా ఉందంటే… రీమేక్ సినిమా అయినప్పటికీ ఒరిజినల్ కథలో ఉన్న పాత్ర కంటే విభిన్నంగా వరుణ్ ఎట్రాక్ట్ చేశాడు. ఇక హరీష్ శంకర్ డైరెక్టర్ గా మరోసారి తన మాస్ ఎలిమెంట్స్ ని కరెక్ట్ గా ప్రజెంట్ చేశాడు. ప్రతి సీన్ లో తన మార్క్ మేకింగ్ ని చూపించాడు. ఇక పూజా హెగ్డే వెల్లువచ్చి గోదారమ్మా సాంగ్ ఆమె చూపించిన హావభావాలు శ్రీదేవిని గుర్తు చేస్తాయి. ఆ పాట ఒక మంచి ఫీల్ ని కలిగిస్తుంది. వరుణ్ గద్దల కొండ గణేష్ గా డైలాగ్స్ డెలివరీ అలాగే నెగిటివ్ షేడ్స్ ని సరికొత్తగా ప్రజెంట్ చేశాడు. మరో హీరో అథర్వ కూడా తన మార్క్ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి మంచి బూస్ట్ ని అందించాయి. ఫస్ట్ హాఫ్ అలా అలా సాగినా సెకండ్ హాఫ్ డిఫరెంట్ ఎపిసోడ్స్ సినిమకు ఉపయోగపడ్డాయి. పెద్దగా అంచనాలు లేకుండా వెళితే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ప్రేక్షకులకు.
previous post