వరుణ్ తేజ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించిన “వాల్మీకి” సినిమా టైటిల్ మారింది. సినిమా టైటిల్ను “గద్దలకొండ గణేశ్”గా మార్చారు. “వాల్మీకి” టైటిల్ అభ్యంతరకరంగా ఉందని బోయ సామాజిక వర్గానికి చెందిన బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ చిత్రంలో అధర్వ మురళి ముఖ్య పాత్ర పోషించారు. పూజా హెగ్డే కథానాయికగా నటించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించారు. ఇప్పటికే ‘గద్దలకొండ గణేష్’ ప్రీమియర్ షోలు యూఎస్లో ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమాను చూసిన కొంత మంది సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ తేజ నటన, అతడి మేనరిజమ్స్, డైలాగ్స్ చెప్పే తీరు విపరీతంగా ఆకట్టుకుందని చెబుతున్నారు. తెలంగాణ యాసలో మాస్ డైలాగులను వరుణ్ అవలీలగా చెప్పేశాడని.. హరీష్ శంకర్ రాసిన డైలాగులు థియేటర్లో బాగా పేలాయని చెబుతున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్ బ్యాంగ్ ట్విస్ట్, క్లైమాక్స్ ఇలా సినిమాలో ప్రతీ అంశం ఆకట్టుకుందనే టాక్ వినిపిస్తోంది. మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతం సినిమాకు మరో బలమని చెబుతున్నారు.
next post