నేడు ఐసీసీ వరల్డ్ కప్ లో భాగంగా జరుగుతున్న ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్ లో హార్డ్హిట్టర్ జేసన్ రాయ్ విధ్వంసం సృష్టించాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్లో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇంగ్లీష్ ఇన్నింగ్స్లో రాయ్ బ్యాటింగే హైలెట్. మెహిదీ హసన్ వేసిన 35వ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాది సునామీ సృష్టించాడు. నాలుగో బంతిని కూడా స్టాండ్స్లోకి పంపే క్రమంలో మొర్తజాకు క్యాచ్ ఇచ్చాడు. హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన తర్వాతి బంతికే రాయ్ వెనుదిరిగాడు.
అంతకుముందు షకీబ్ వేసిన 31వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు, సిక్స్ కొట్టి 17 రన్స్ చేశాడు. తన మెరుపు ఇన్నింగ్స్లో 121 బంతులు ఎదుర్కొన్న రాయ్ 14ఫోర్లు, 5సిక్సర్ల సాయంతో 153 పరుగులు చేసి ఇంగ్లాండ్కు భారీ స్కోరు అందించాడు. ప్రస్తుతం 40 ఓవర్లలో ఇంగ్లాండ్ 3 వికెట్లకు 275 పరుగులు చేసింది. జోస్ బట్లర్(30), ఇయాన్ మోర్గాన్(14) క్రీజులో ఉన్నారు. ఇంకా 10 ఓవర్లు ఉండటం.. చేతిలో వికెట్లు కూడా ఉండటంతో 350కి పైగా స్కోరు చేయాలని ఆతిథ్య జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా స్కోర్ బోర్డు : 341/6(48ఓవర్లు)
నల్లమలను నాశనం చేయొద్దు… కేటీఆర్ కు శేఖర్ కమ్ముల పోస్ట్