లావైపోతున్నాం.. భోజనం మానేసి, చపాతీలు తినాల్సిన సమయం వచ్చింది.. అనుకోని, రోజు ఉదయం, రాత్రి అవే తినడం మొదలుపెడుతున్నారు. కానీ అది అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా తీసుకునే భోజనం మానుకొని, రెండే కదా అని చపాతీలు తినడం చాలా మంది అలవాటు చేసుకుంటున్నారు. దీనితో బరువు అదుపులో ఉంచుకోవచ్చు అనుకుంటున్నారు. కానీ, కేవలం రెండు చపాతీలు, ఒక ఫుల్ మీల్స్ తో సమానం అంటున్నారు నిపుణులు. అందుకే ఆ పద్దతి పాటిస్తున్నా .. అధిక బరువు బయటపడట్లేదు అంటున్నారు నిపుణులు.
ఇక రాత్రి పనేమీ చేయము, కానీ భోజనం చేసినంతగా రెండు చపాతీలు తీసుకుంటాం. డాక్టర్లు కూడా ఈ మధ్య నైట్ టైం చపాతీలు తినమనే సజెస్ట్ చేయడంతో ఎక్కువ మంది దీనివైపే మొగ్గుచూపుతున్నారు.కాకపోతే చపాతి తినేవాళ్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
దీనికి విరుగుడుగా… చపాతిని చాలా తక్కువ నూనేతో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అసలు నూనే వేయకుంటే మరింత మంచిది.
ప్లేట్ నిండుగా భోజనం చేసినా ఒకటే, రెండు లేదా మూడు చపాతీలు తిన్నా ఒక్కటేనని డాక్టర్లు అంటున్నారు. అన్నం కంటే చపాతి శరీరానికి అధిక శక్తినిస్తుందని తాజాగా నిరూపితం అయ్యింది.
శక్తిని ఇస్తున్నంత మాత్రాన ఈ చపాతిల్లో కొవ్వు పదార్థాలు ఉండవు. ఎందుకంటే గోదుమల్లో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు.
గోధుమలలో ఎక్కువగా విటమిన్ బి, ఇ, కాపర్, అయోడిన్, జింక్, మాంగనీస్, సిలికాన్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి. గోదుమల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.
ఏ అర్దరాత్రి వరకో పని చేసుకుంటూ ఉండిపోయి, అప్పుడు భోజనం చేసి వెంటనే కునుకు తీస్తుంటారు, కానీ ఈ విధంగా చేయడం ఆరోగ్యానికి హానికరం.భోజనం చేయడానికి,నిద్ర పోవడానికి మధ్య గ్యాప్ ఉంటే బాగుంటుంది. అలా చేయలేని వారికి చపాతి తీసుకోవడం ఉత్తమం.
చపాతి కూడా ఎక్కువగా తినకూడదు. ప్రతి రోజు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.