టీఎస్ఆర్టీసీ మేడారం సమ్మక్క-సారలమ్మ ఉత్సవ జాతరలకు వెళ్లే భక్తులకు ప్రత్యేక నజరానా ప్రకటించింది. వచ్చే నెలలో జరిగే మేడారం జాతర ఉత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 1వ తేదీలోపల దైవదర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు వారి వారి ఇండ్లవద్దకే బస్సులు పంపనున్నట్లు నగరంలోని చెంగిచర్ల ఆర్టీసీ డిపో మేనేజర్ వి.మల్లయ్య తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అదనపు సమాచారం, బస్సుల బుకింగ్ కోసం డిపో మేనేజర్7893088433, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) 7382924742 సంప్రదించవచ్చు.
previous post
next post
టీడీపీ వాళ్లు పిటిషన్లు వేసినా భయపడవద్దు: స్పీకర్ తమ్మినేని