మెదక్ జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక చారిత్రాత్మకమైనదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పారు. ఉపఎన్నికలో గెలిచేందుకు పార్టీ శ్రేణులు విభేదాలను పక్కనపెట్టి ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణను ప్రారంభించామని తెలిపారు. పోటీ చేయబోయే అభ్యర్థిని త్వరలోనే ఎంపిక చేస్తామని చెప్పారు. మండల కమిటీలను మూడు రోజుల్లోగా పూర్తి చేయాలని డీసీసీ అధ్యక్షులను ఆదేశించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసిందని అన్నారు.