ఈ నెల 17తో లాక్డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో దేశీయ విమాన సర్వీసులు నడపాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు సడలింపులు ఇచ్చిన కేంద్రం విమాన సేవలు పునఃప్రారంభించాలని నిర్ణయించినట్టు సమాచారం. విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలపై డీజీసీఏ, సీఐఎస్ఎఫ్, విమానాశ్రయాల ప్రాధికార సంస్థ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఢిల్లీ విమానాశ్రయంలో నిన్న డీఐఏఎల్ అధికారులతో కూడిన కమిటీ తనిఖీలు నిర్వహించింది. సర్వీసులు ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల నుంచి దేశీయ సర్వీసులను ఈ నెల 18 నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
బీజేపీతో మళ్లీ పొత్తు కోసం చంద్రబాబు తహతహ: సోము వీర్రాజు