కరోనా పరిస్థితుల్లో చిన్న సినిమాలతో పాటు మీడియం బడ్జెట్ సినిమాలు సైతం ఓటిటీ వేదికలపై విడుదల కావడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే నాని ‘వి’, సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ కూడా కరోనా కారణంగా అమేజాన్ లో విడుదల అవుతున్నాయి. అదేవిధంగా తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న 40వ సినిమా ‘జగమే తంత్రం’. ఈ సినిమాను తమిళంలో ‘జగమే తంతిరమ్’ పేరుతో రూపొందిస్తున్నారు. ఇందులో ధనుష్ సరసన ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వైనాట్ స్టూడియోస్ బ్యానర్పై శశికాంత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి వెంకట్ కాచర్ల డైలాగ్స్ రాస్తున్నారు. సంతోశ్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా విడుదల కాలేదు. అయితే ఇప్పుడు సూర్య సినిమా ఓటీటీలో వస్తుండటంతో ధనుష్ సినిమా కూడా అలానే విడుదల కానుంది అనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ సినిమా విడుదలపై నిర్మాత వై నాట్ స్టూడియోస్ అధినేత సష్ స్పష్టత ఇచ్చారు. తన ట్విట్టర్ వేదికగా ”ఈ సినిమాను మీతో పాటు మేము కూడా బిగ్ స్క్రీన్ పైన చూడటానికే ఇష్టపడుతున్నాము” అని తెలిపారు.
previous post