టీఆర్ఎస్ సర్కార్పై కాంగ్రెస్ నేత, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చాక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయిందని ఆరోపించారు. సోమవారం ఉదయం కూకట్పల్లిలోని ఐడీఎల్ చెరువుకట్టపై వాకర్స్ని రేవంత్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐడీఎల్ చెరువు కట్ట రోడ్డుపై వరుస ప్రమాదాలు జరుగుతున్నా టీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోవటం లేదని విమర్శించారు.
దోమల వల్ల వాకర్స్ ఇబ్బందులు పడుతున్నారు. టీఆర్ఎస్కు 15మంది ఎంపీలు ఉన్నపట్టికీ తెలంగాణ కోసం పార్లమెంటులో చేసిందేమి లేదన్నారు. టీఆర్ఎస్ నాయకులకు పార్టీలో గౌరవం ఉండాలంటే ప్రతిపక్షం గెలవాలన్నారు. ప్రతిపక్షం గెలిస్తేనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రగతిభవన్ గేట్లు తెరుచుకుంటాయన్నారు. మల్కాజ్గిరి అభివృద్ధి చెందాలంటే హైదరాబాద్ తరపున పార్లమెంటులో గొంతు వినిపించే నాయకులు ఉండాలని పేర్కొన్నారు.
ముస్లింలు సొంతంగా రాజకీయ వేదికను సిద్ధం చేసుకోవాలి: ఒవైసీ పిలుపు