కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకూ ఉధృత రూపం దాల్చుతోంది. దీని దెబ్బకి ప్రపంచంలోని చాలా దేశాలు లాక్డౌన్లో ఉన్నాయి. . ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలు చెబుతున్న సలహాలు పాటించడం తప్ప చేసేదేమీ లేదు. ఈ సందర్భంగా కమెడియన్ వడివేలు ఓ వీడియోలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకుని మరీ ప్రజలను వేడుకున్నారు. ‘ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఏనాడూ ఊహించలేదన్నారు. చాలా మనోవేదనకు గురవుతున్నా. దయచేసి రోడ్ల మీద తిరగకండి. ఇక డాక్టర్లు, నర్సులు వారి ప్రాణాలను పణంగా పెట్టి ఈ మహమ్మారిపై పోరాటం చేస్తున్నారు. మనల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పోలీసులు కూడా చాలా చోట్ల చేతులు జోడించి వేడుకోవడం చూశాను. దయచేసి మన కోసం, మన వారందరూ కష్టపడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలు చెప్పింది విని, ఇంటిపట్టునే ఉండండి. ఎవరూ బయటికి రావద్దు మిమ్మల్ని వేడుకుంటున్నా’.. అని చెబుతూ వడివేలు కన్నీటి పర్యంతమయ్యారు.
previous post