telugu navyamedia
సినిమా వార్తలు

“కలర్స్” స్వాతి రీఎంట్రీ

Colors-Swathi

నిఖిల్, ‘కలర్స్’ స్వాతి హీరోహీరోయిన్లుగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం “కార్తికేయ”. 2014లో తెరకెక్కిన ఈ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ లభించింది. సుబ్రమణ్య స్వామి ఆలయం నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ చేసే పనిలో పడ్డారు దర్శకుడు చందూ మొండేటి. నిఖిల్ హీరోగా “కార్తికేయ-2″ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే ఈ సీక్వెల్ లో ఇద్దరు కథానాయికలు నటించనున్నారట. ఒక కథానాయిక కొత్త అమ్మాయి అయితే, మరో కథానాయిక ‘కలర్స్’ స్వాతి అని సమాచారం. అయితే కొంతకాలం క్రితమే స్వాతికి పెళ్లైపోయింది. దీంతో ఆమె సినిమాలకు దూరమవుతుందని అంతా భావించారు. కానీ “కార్తికేయ-2″లో చేయడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొదటిభాగంలోని పాత్రకు కొనసాగింపుగా రెండవభాగం ఉంటుందట. అందుకే స్వాతి కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. పెళ్లి తరువాత స్వాతి చేయనున్న మొదటి సినిమా ఇదే. ఇకపై కూడా స్వాతి తన సినిమా కెరీర్ ను కంటిన్యూ చేస్తుందేమో చూడాలి.

Related posts