telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ రోజులను ఎప్పటికి మరిచిపోలేను… నాగార్జున ఎమోషనల్ పోస్ట్

nagarjuna about his health condition

మే 22, మే 23 తేదీలు తన జీవితంలో ఎన్నడూ మరిచిపోనని టాలీవుడ్ కింగ్ నాగార్జున ఎమోషనల్ ట్వీట్ చేశారు. మే 22న “అన్నమయ్య” సినిమా విడుదలయితే, మే 23న అక్కినేని కుటుంబంలోని హీరోలంతా వెండితెరపై అలరించిన “మనం” సినిమా రిలీజ్ అయ్యింది. అందుకే ఆ రెండు రోజుల్ని తన జీవితంలో మరిచిపోలేనంటూ నాగ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అన్నమయ్య సినిమా విషయానికి వస్తే… ఆయన 15వ శతాబ్దపు తెలుగు వాగ్గేయకారుడు. అన్నమయ్య జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన అన్నమయ్య చిత్రం 1997 మే 22న విడుదలైంది. ఈ చిత్రాన్ని చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ శాసనసభ సభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడూ అయిన వి.దొరైస్వామి నాయుడు నిర్మించాడు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తొలి పౌరాణికచిత్రం “అన్నమయ్య”. ఈ సినిమాను తమిళంలోకి డబ్బింగు చేసి “అన్నమాచారియర్” గానూ, హిందీలోకి డబ్బింగు చేసి “తిరుపతి శ్రీ బాలాజీ”గానూ విడుదల చేశారు. ఇక “మనం” సినిమా గురించి అందరికీ తెలిసిందే. తన సొంత పతాకమైన అన్నపూర్ణ స్టూడియోస్ పై అక్కినేని నాగార్జున నిర్మించిన మల్టీస్టారర్ సినిమా మనం. అక్కినేని కుటుంబంలో మూడు తరాల నటులైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య కలిసి నటించిన ఈ అరుదైన చిత్రంలో శ్రియా, సమంత కథానాయికలుగా నటించారు. గతంలో నితిన్, నిత్యా మీనన్ కలిసి నటించిన ఇష్క్ సినిమా ద్వారా గుర్తింపు సాధించిన విక్రమ్ కుమార్ ఈ సినిమాకి కథ, చిత్రానువాదం, దర్శకత్వాన్ని అందించారు. ఈ సినిమా 2014 మే 23న విడుదల చేశారు.

Related posts