ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేటి నుంచి ప్రజాదర్బార్ లో ఫిర్యాదులు తీసుకుంటారనే ప్రచారం జరగడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రజలు పెద్దసంఖ్యలో తాడేపల్లిలోని జగన్ నివాసానికి రావడంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. సీఎం ను కలవాలంటూ ఒక్కసారిగా ప్రజలు లోపలికి రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో అనంతపురం జిల్లా కనేకల్లు మండలానికి చెందిన విశ్రాంతమ్మ అనే మహిళ ఊపిరిఆడక స్పృహ కోల్పోయింది. దీంతో పోలీసులు ఆమెను అంబులెన్సులో హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. .
అయితే అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాక ఆగస్టు 1 నుంచి ప్రజాదర్బార్ ను చేపడతామని మంత్రి కన్నబాబు ప్రకటించారు. ఈ విషయం తెలియని పలువురు ప్రజలు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. సీఎం జగన్ తమ అర్జీలు స్వయంగా తీసుకుంటారన్న ఆశతో భారీ సంఖ్యలో ప్రజలు జగన్ నివాసానికి రావడంతో తొక్కిసలాట జరిగింది.
రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని చెప్పి.. పోలీసు రాజ్యాన్ని తీసుకొచ్చారు: దేవినేని