telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఉపఎన్నికకు .. బరిలో 31మంది ..

election notifivation by 12th said ec

రాష్ట్ర ఎన్నికల సంఘం హుజూర్‌నగర్ ఉప ఎన్నిక బరిలో 31 మంది అభ్యర్థులు నిలిచినట్టు ప్రకటించింది. ఉప ఎన్నిక కోసం మొత్తం 76 నామినేషన్లు దాఖలు కాగా 45 తిరస్కరణకు గురైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇటీవల జరిగిన నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికలో అత్యధికంగా 76 మంది పోటీపడగా, ఆ తర్వాత ఎక్కువమంది పోటీ పడుతున్నది హుజూర్‌నగర్‌లోనే.

21న పోలింగ్ జరగనుండగా, 24న ఫలితం వెలువడనుంది. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి పద్మావతిరెడ్డి, బీజేపీ నుంచి రామారావు, తెలుగుదేశం నుంచి కిరణ్మయిలు పోటీలో ఉన్నారు. సీపీఎం తరపున పారేపల్లి శేఖర్‌రావు వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.

Related posts