telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అవినీతి నిర్మూలన అందరి లక్ష్యం కావాలి: సీఎం జగన్

jagan

రాష్ట్రంలో అవినీతి నిర్మూలన అందరి లక్ష్యం కావాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. అధికారులు సహకరిస్తేనే ప్రభుత్వ కలలు నెరవేరుతాయని జగన్ అన్నారు. సచివాలయంలో జగన్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు తమకు ఉన్న పూర్తి అవగాహనతో సహకరించాలన్నారు. మంచి పనితీరు ప్రదర్శించే అధికారులను సత్కరిస్తాను అని జగన్ తెలిపారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమను ఎన్నుకున్నారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దని సూచించారు.

మన పాలన దేశానికే ఆదర్శంగా ఉండాలన్నారు. అవినీతిని నిర్మూలించి ప్రభుత్వానికి నిధులు ఆదా చేయండి అని సూచించారు. అధికారులపై తనకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉందన్నారు. ఈ ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారం లేని పారదర్శక పాలన అందించడానికి దృఢసంకల్పంతో ఉన్నానని సీఎం జగన్ స్పష్టం చేశారు.

Related posts