telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

నిజామాబాద్ మర్డర్ కేసు చేధించిన పోలీసులు..

తెలంగాణ నిజామాబాద్ ప్లాస్టిక్ పైపుల కంపెనీ మార్కెటింగ్ ఆఫీసర్ నారాయణ హత్య కేసులో షాకింగ్ నిజాలు బయట పడుతున్నాయి. నారాయణ హత్య కేసు క్రైమ్ కధా చిత్రాన్ని తలపిస్తోంది. వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని ప్లాన్ ప్రకారం ప్రియునితో కలిసి భార్య శిరీష హత్య చేసినట్టు గుర్తించారు. 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇంట్లో బాయ్ ఫ్రెండ్ తో కలిసి భర్తను కిరాతకంగా చంపేసింది.ఛాతీ, కడుపులో 4 కత్తి పొట్లు పొడిచిన శిరీష ఇంకా చనిపోలేదని చెప్పడంతో మళ్లీ దాడి చేసిన బాయ్ ఫ్రెండ్ ఎట్టకేలకు చంపేశాడు. మొత్తం నారయణ బాడీ మీద 8 కత్తీ పోట్లను పోలీసులు గుర్తించారు. చంపిన తర్వాత 8 గంటల పాటు ఇంట్లోనే డెడ్ బాడీతో భార్య, బాయ్ ఫ్రెండ్ గడిపారు. ఆ మరుసటి రోజు మృత దేహాన్ని ప్లాస్టిక్ సంచిలో మూటకట్టి మంచిప్ప అటవీ ప్రాంతం లో మరో వ్యక్తి  కలిసి బాయ్ ఫ్రెండ్ పారేసి వచ్చాడు. సీసీ కెమెరాలో మృతదేహం తరలిస్తున్న ఆనవాళ్లతో పోలీసులు కేసు ఛేదించారు. దీంతో భార్య, బాయ్ ఫ్రెండ్ కటకటాలోకి వెళ్లారు. అయితే ఇంతకముందు కూడా ఇలాంటి కేసులు బాగానే నమోదైన విషయం నాదరికి తెలిసిందే.

Related posts