సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా తన నటన, డ్యాన్స్ తో ప్రేక్షకులను మెప్పించి, అంచెలంచెలుగా ఎదుగుతూ అభిమానులతో మెగాస్టార్ గా బిరుదును అందుకున్న టాలీవుడ్ సీనియర్ నటుడు చిరంజీవి. “పునాది రాళ్ళు” చిత్రంతో ఇండస్ట్రీలోతన నట ప్రస్థానాన్ని మొదలు పెట్టిన చిరు నేటితో నటుడిగా 40 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. 1978లో ఆయన వెండితెరకి ఎంట్రీ ఇచ్చారు. అయితే “పునాది రాళ్ళ”తో నట ప్రస్థానం ప్రారంభించినప్పటికి, ముందుగా విడుదలయ్యింది మాత్రం “ప్రాణం ఖరీదు” సినిమా.
కొణిదెల శివశంకర వరప్రసాద్ పేరుతో ఇండస్ర్టీలోకి అడుగు పెట్టిన మెగాస్టార్ తరువాత తన పేరును చిరంజీవిగా మార్చుకున్నారు. ఇప్పటి వరకూ ఆయన 150కి పైగా సినిమాల్లో నటించారు. అంతేకాదు రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో కొన్నాళ్ళు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన చిరంజీవి ఖైదీ నెం 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న “సైరా” అనే చారిత్రాత్మక చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానున్నట్టు సమాచారం.
విజయ్ దేవరకొండపై వ్యాఖ్యలు… బాలీవుడ్ నటుడికి ఆనంద్ కౌంటర్