telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ కౌంటర్.. ఇద్దరు నక్సల్స్‌ హతం

naksals encounter

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు నక్సల్స్‌ హతమయ్యారు. గదిరాస్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని మంక్పాల్‌ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నక్సల్స్‌ కోసం పోలీసు బలగాలు కూంబింగ్‌ నిర్వహించాయి. ఈ క్రమంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.

ఈ ఘటనలో ఇద్దరు నక్సల్స్‌ మృతి చెందారు. ఘటనాస్థలి నుంచి రెండు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నక్సల్స్‌ను గుందధర్‌, ఐతుగా పోలీసులు గుర్తించారు. గుందధర్‌పై రూ. 5 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

 

Related posts