ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు నక్సల్స్ హతమయ్యారు. గదిరాస్ పోలీసు స్టేషన్ పరిధిలోని మంక్పాల్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నక్సల్స్ కోసం పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
ఈ ఘటనలో ఇద్దరు నక్సల్స్ మృతి చెందారు. ఘటనాస్థలి నుంచి రెండు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నక్సల్స్ను గుందధర్, ఐతుగా పోలీసులు గుర్తించారు. గుందధర్పై రూ. 5 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.