telugu navyamedia
రాజకీయ వార్తలు

చంద్రబాబుకు రాఖీ కట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క

రేపు రాఖీ పండుగను పురస్కరించుకుని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు హైదరాబాదులోని తన నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. టీడీపీలో చేరినప్పటి నుంచి ప్రతి ఏడాది చంద్రబాబుకు రాఖీ కట్టడం ఆమెకు ఆనవాయితీగా మారింది. మరోవైపు, సీతక్కతో పాటు మాజీ మంత్రి పరిటాల సునీత కూడా చంద్రబాబుకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్ప గుచ్చం అందజేశారు. వీరిద్దరూ చంద్రబాబుకు రాఖీ కడుతున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చంద్రబాబు కుడిచేతి నరంపై ఒత్తిడి పెరగడంతో నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారు. దీంతో ఆయన హైదరాబాదులోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు చంద్రబాబుకు రాఖీలు కట్టారు.

Related posts