ఏపీ మాజీ సీఎం చంద్రబాబు భద్రతకు సంబంధించిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇరువాదనలు విన్న హైకోర్టు తీర్పు వెల్లడించింది. చంద్రబాబు కు ఇకపై 97 మందితో భద్రత కల్పించాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిందిచంద్రబాబు సీఎస్ఓను ప్రభుత్వం నియమించవచ్చని పేర్కొంది. చంద్రబాబు కాన్వాయ్ లో జామర్ ఇవ్వాలనీ ఆదేశించింది. క్లోజ్డ్ ప్రొటెక్షన్ టీమ్ విధులు ఎవరు నిర్వహించాలనే విషయంలో ఎన్ఎస్జీ, ఐఎస్ డబ్లూ కలిసి చర్చించుకోవాలని సూచించింది.
భద్రత అంశంపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. చంద్రబాబుకు 5 ప్లస్ టూ భద్రత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు భద్రతను తగ్గించడం జరిగింది. ఈ నేపథ్యంలో తనకు ఉద్దేశపూర్వకంగానే భద్రత తగ్గించారంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.