telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై కేసు నమోదు

vanama venkateshwar rao

కొత్తగూడెం టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన కుమారుడు వనమా రాఘవేంద్రరావుతో పాటు పలువురు నేతలపై కూడా కేసులు నమోదు చేసినట్టు సీఐ కరుణాకర్ తెలిపారు.లక్ష్మిదేవిపల్లి మండలంలోని టూరిజం హోటల్ వద్ద అటవీ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు ఇటీవల అటవీ అధికారులు కందకాలను తవ్వారు. అయితే, ఆ భూములకు పట్టాలు ఉన్నాయంటూ పలువురు గిరిజనులు అడ్డుకున్నారు.

గిరిజనులు ఈ విషయాన్ని వారు వనమా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, ఘటనా స్థలికి చేసుకున్న ఆయన అటవీ అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. అటవీ అధికారులను బెదిరించారని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎంఆర్పీ రావు లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే వనమా పై ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు వనమా వెంకటేశ్వరరావు, వనమా రాఘవేంద్రరావు, మాజీ ఎంపీటీసీ పూనెం శ్రీను, ఖనాముద్దీన్ తదితరులపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

Related posts