ఇటీవల కరోనాను జయించిన బండ్ల గణేష్.. పాలిటిక్స్లో లేను అంటూనే ఏపీ పాలిటిక్స్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. పవన్ సినిమాలపై మాట్లాడగలను… కానీ ఆయన రాజకీయ ప్రస్థానం ఆయన ఇష్టం. జనసేన పార్టీకి ఒక్క సీటే రావడం.. పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోవడం బాధగానే అనిపించింది. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పెట్టినప్పటికీ కూడా.. ఆ పార్టీ ఓడిపోతుందని నాకు ముందే తెలుసు. అక్కడ వైఎస్ఆర్సీపీకి 130 సీట్లు పక్కాగా వస్తాయని నాకు ముందే తెలుసు. ఢిల్లీలో నాకు లగడపాటి మధు అని ఫ్రెండ్ ఉన్నారు.. ఆయనకు ఎన్నికల ఫలితాలపై బాగా అవగాహన ఉండేది.. ఆయనే చెప్పారు.. జగన్ 130 సీట్లకు పైగా గెలుస్తున్నాడు అని, అన్ని సీట్లు ఎందుకు వస్తాయి సార్ అనేవాడిని. లోకేష్ కూడా ఓడిపోతున్నాడని ఆయన ముందే చెప్పారు. అదేంటి సార్.. అంటే!! చూడు ఏం జరుగుతుందో అన్నారు. ఆయన అన్నట్టుగానే లోకేష్ ఓడిపోయాడు. అలా లోకేష్ ఓడిపోతున్న విషయం నాకు ముందుగానే తెలుసు. లోకేష్ సీఎం అవుతాడో లేదో నాకు తెలియదు.. నాకు అవకాశం వస్తే నేనే అవుతా.. లేదంటే నా కొడుకుని చేస్తా కాని.. లోకేష్ సీఎం అవుతాడో లేదో నేను చెప్పలేను. ప్రస్తుతం నేను ఏ పార్టీలోనూ లేను.. పాలిటిక్స్ నాకు సంబంధం లేని విషయం” అంటూ చెప్పుకొచ్చారు బండ్ల గణేష్.
previous post