telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దళితులను అణగతొక్కాలని ప్రభుత్వం కుట్ర: చినరాజప్ప

chinarajappa Mla

దళితులను అణగతొక్కాలని జగన్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ హోంమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు. దళితుడైన జస్టిస్ రామకృష్ణకు అన్యాయం జరిగిందని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిపై కేసు పెడితే… జస్టిస్ రామకృష్ణపై కౌంటర్ కేసు పెట్టడానికి జగన్ ప్రభుత్వం పూనుకుందన్నారు.

సీతానగరంలో వరప్రసాద్ అనే దళితుడిని పోలీసులే శిరోముండనం చేసి చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. చీరాలలోమరో దళితుడికి మాస్కు లేదనే నెపంతో పోలీసులులే కొట్టి చంపడం చేయడంతో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ సంపూర్తిగా నిర్వీర్యం అయిందని చినరాజప్ప విమర్శించారు.

Related posts