telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో ఉచిత విద్యుత్ పేరిట భారీ దొపిడీ: బండి సంజయ్

BJP Bandi sanjay

తెలంగాణలో ఉచిత విద్యుత్ పేరిట భారీ దొపిడీ జరుగుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడారు. విద్యుత్ సవరణ చట్టం వస్తే, తమ దోపిడీకి అడ్డుకట్ట పడుతుందన్నదే ప్రభుత్వ ఆందోళనని ఆయన మండిపడ్డారు. పాతబస్తీలో జరుగుతున్న విద్యుత్ చౌక్యంపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విద్యుత్ సవరణ చట్టంపై అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టడానికి ముందే, వద్దంటూ అసెంబ్లీలో ఎలా తీర్మానం చేశారని ప్రశ్నించారు. ఈ చట్టం అమలైతే, ఉద్యోగాలు ఎందుకు పోతాయో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు లేని ఇబ్బంది తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఎందుకో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చట్టం గురించి సరిగ్గా తెలియకుంటే జగన్ తో మాట్లాడి తెలుసుకోవాలని కేసీఆర్ కు సలహా ఇచ్చారు.

Related posts