ఏపీసీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమెరికాకు చేరుకున్నారు. ఆయనకు ప్రవాసాంధ్రులు వాషింగ్టన్ డిసి ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు. భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారులు సిఎంకు ఆహ్వానం పలికారు. శుక్రవారం రాత్రి అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధు లతో సమావేశం అయ్యారు.
అనంతరం అమెరికాలో భారత రాయబారి ఆహ్వానం మేరకు విందులో పాల్గొన్నారు. తరువాత ఆయన డల్లాస్కు చేరుకున్నారు. శనివారం ఉదయం నార్త్ అమెరికాలోని తెలుగు వాళ్లను కలుసుకుని వారినుద్దేశించి ప్రసంగించనున్నారు.
టీడీపీ వాళ్లు పిటిషన్లు వేసినా భయపడవద్దు: స్పీకర్ తమ్మినేని