telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కొత్త రాజ్‌భవన్‌లో ఏపీ గవర్నర్‌ నివాసం

biswabhusan harichandan governor

ఆంధ్రప్రదేశ్‌ కొత్త గవర్నర్‌ గా విశ్వభూషణ్‌ హరిచందన్‌ ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ నెల 24నుంచి కొత్త రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ నివాసం ఉంటారని జేఏడీ కార్యదర్శి సిసోడియా తెలిపారు. బెజవాడలో రాజ్ భవన్‌గా ఖరారు చేసిన ఇరిగేషన్ భవనాన్ని గురువారం గవర్నర్ కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా, సిసోడియాతో కలిసి పరిశీలించారు.

అనంతరం సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. ఒక దర్బార్ హాల్, ఒక మీటింగ్ హాల్, ఏడు బెడ్ రూమ్స్, ఏడు ఆఫీస్ రూమ్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ నెల 23 నాటికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి గవర్నర్ కోసం భవనాన్ని సిద్దం చేస్తామని వెల్లడించారు. భద్రతా విషయాల రీత్యా కూడా ఈ కొత్త రాజ్‌భవన్‌ బాగుందని తెలిపారు.

Related posts