telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మోదీతో గొడవవద్దని చంద్రబాబుకు చెప్పాను.. వినిపించుకోలేదు: అంబికా కృష్ణ

ambika krishna

రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలు ఎటువైపు ఉన్నారో సులభంగా అర్థం అయిపోతుందని బీజేపీ నేత అంబికా కృష్ణ అన్నారు. నేను చంద్రబాబుకు చెప్పాను. పెద్దవాళ్లతో కూడా చెప్పించాను. సార్.. మనకు మోదీతో గొడవవద్దు. మనకు కావాల్సింది మళ్లీ అధికారంలోకి రావడం అని చెప్పా. కానీ చంద్రబాబు వినిపించుకోలేదని అంబికా కృష్ణ వ్యాఖ్యానించారు. చివరికి 303 లోక్ సభ సీట్లతో మోదీ ప్రభుత్వం ఏర్పడిందని అంబికా కృష్ణ అన్నారు.

20 ఏళ్ల కోసం టీడీపీ కోసం పనిచేసిన తాను బీజేపీలోకి వెళ్లిపోతానని చంద్రబాబు అస్సలు ఊహించి ఉండరని వ్యాఖ్యానించారు. పార్టీ మారేముందు విషయాన్ని బాలకృష్ణకు ముందే చెప్పానన్నారు. అయితే ఈ విషయమై చంద్రబాబుతో మాత్రం చర్చించలేదన్నారు. టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్ కు ప్రజల్లో అంత ఆదరణ రాలేదని తెలిపారు. నిజంగా అంత ఆదరణ ఉండి ఉంటే మంగళగిరిలో లోకేశ్ గెలిచిఉండేవాడని వ్యాఖ్యానించారు. ఓ రాజకీయ పార్టీగా టీడీపీ నిలదొక్కుకోవడం చాలా కష్టమని అంబికా కృష్ణ చెప్పారు.

Related posts