స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న చిత్రం “అల వైకుంఠపురములో”. 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రాన్ని హారిక మరియు హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లలో ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, సీనియర్ నటి టబు, నవదీప్, మురళి శర్మ, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుందని సమాచారం. ఇప్పటికే సినిమాలోని రెండు పాటలు విడులైన సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. తమన్ స్వరకర్త. తాజాగా ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో హీరోది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అట. అయితే, టబు బాగా డబ్బున్న హైక్లాస్ ఫ్యామిలీకి కోడలిగా వెళ్తుందట. కానీ, ఆ ఇంటికి వెళ్లిన తరవాత టబుకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయట. అక్క సమస్యలను పరిష్కరించడానికి బన్నీ రంగంలోకి దిగుతారు. ఇదే అసలు కథ అని టాక్. అంతేకాదు, బన్నీ నేరుగా తన అక్క ఇంటికి వెళ్లి అక్కడే ఉండి సమస్యలను పరిష్కరిస్తారట. బన్నీ వాళ్ల అక్క ఇంటిలోకి అడుగుపెట్టే విధానం, అక్కడ జరిగే తతంగం చాలా ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా, ప్రీ క్లైమాక్స్లో బన్నీ బిలియనీర్గా కనిపిస్తారట. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి బిలియనీర్ ఎలా అయ్యాడు అనేది కూడా ఆసక్తికరమైన అంశం.
previous post
గొప్పేముంది ? అంటూ మోడీపై హీరోయిన్ కామెంట్స్