స్టైలిష్స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘అల వైకుంఠపురములో…’ వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో టబు, సుశాంత్, నవదీప్ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. థమన్ సంగీతం అందించారు. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. “అల వైకుంఠపురము”లో చిత్ర మ్యూజికల్ కాన్సెర్ట్ సోమవారం సాయంత్రం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి టబు, సునీల్, సుశాంత్, త్రివిక్రమ్, అల్లు అరవింద్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ‘‘నిజం చెప్పేప్పుడే భయమేస్తుంది నాన్న.. చెప్పకపోతే ఎప్పుడూ భయమేస్తుంది’’, ‘‘దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్. ఒకటి నేలకి, రెండు వాళ్లకి. అలాంటోళ్లతో మనకి గొడవేంటి సార్. జస్ట్ సరెండర్ అయిపోవాలంతే’ వంటి పంచ్ డైలాగులు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతున్నాయి. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.