చైనాలోని పారిశ్రామికవాడలో సంభవించిన భారీ పేలుడు ఘటనలో 44 మంది మృతి చెందగా, మరో 90 మంది తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు చైనాలోని యాంచెంగ్ పట్టణంలో ఉన్న చెంజియగాంగ్ ఇండస్ట్రియల్ పార్క్లో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను పట్టణంలోని 16 వేర్వేరు ఆసుపత్రుల్లో చేర్పించారు. పేలుడు తీవ్ర స్థాయిలో ఉండడంతో భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం.
ఇంకా విష వాయువులు లీకయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో మరిన్ని పేలుళ్లు సంభవించవచ్చని భావిస్తున్నారు. సమీప ప్రాంతాల్లోని దాదాపు 1000 నివాస గృహాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చైనా పరిశ్రమల్లో తరుచూ అగ్నిప్రమాద ఘటనలపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 2015 లో తియాంజిన్ అనే పట్టణంలోని కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించడంతో దాదాపు 165మంది చనిపోయారు.