నటుడు, మాజీ ఎంపీ జేకే రితీష్ (46) కన్నుమూశారు. శనివారం తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందారు. 2009 లోకసభ ఎన్నికలలో డిఎంకే అభ్యర్థిగా రామనాథపురం నుంచి ఎంపీగా ఎంపిక అయ్యారు. రితీష్ అకాలమరణంపై పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఆర్జే బాలాజీ హీరోగా నటించిన తొలి చిత్రం, రాజకీయ వ్యంగ్య చిత్రం ‘ఎల్కేజీ’ లో రితీష్ కీలక పాత్రను పోషించారు. హాస్య ప్రధాన, పొలిటికల్ సెటైర్గా, ప్రధానంగా కొందరు రాజకీయ నేతలపై సెటైర్ల సన్నివేశాలతో కూడిన ఈ చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది.
పెళ్ళైన వ్యక్తితో సంబంధం… సంచలన విషయాన్ని బయటపెట్టిన హీరోయిన్