బాలీవుడ్ హాట్ హీరోయిన్ సన్నీ లియోన్ నటించిన తాజా చిత్రం “అర్జున్ పటియాలా”. సన్నీ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు దిల్జీత్ దొసాన్జ్, వరుణ్ శర్మ, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. జూలై 26న చిత్రం విడుదల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే చిత్రంలోని ఓ సన్నివేశంలో సన్నీ తనకి కాల్ చేయమని దిల్జీత్కి ఫోన్ నెంబర్ ఇస్తుంది. అదే సన్నీ ఒరిజినల్ నెంబర్ అనుకొని భావించిన జనాలు ఆ నెంబర్కి వరుస కాల్స్ చేయడం మొదలు పెట్టారట. సినిమాలో సన్నీ చెప్పిన ఫోన్ నెంబర్ ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల యువకుడు పునీత్ అగర్వాల్ది. దీంతో ఆయనని జనాలు వరుస ఫోన్ కాల్స్, మెసేజ్లతో ఇబ్బంది పెడుతున్నారట. ఒక్కోసారి అసభ్యంగా కూడా మాట్లాడుతున్నారట. దీనిపై విసుగు చెందిన పునీత్ ‘అర్జున్ పటియాలా’ సినిమా నిర్మాతలపై కేసు నమోదు చేయాలి అనుకుంటున్నట్లు చెప్పారు. రోజుకు 150 ఫోన్కాల్స్ వస్తున్నాయని, తనను మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై చిత్ర నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
previous post