*నెల్లూరు జిల్లాలో దారుణం
*మైనర్ బాలికపై మేనమామ అత్యాచార యత్నం ..
*బాలిక ప్రతిఘటించడంతో గొంతుకోసి యాసిడ్ దాడి
*ఆస్పత్రిలో బాలిక చికిత్స.. ఆరోగ్య పరిస్థితి విషమం
నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం నక్కలగుట్టలో 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక కామాంధుడు అత్యాచారానికి ప్రయత్నించాడు . బాలిక పెద్దగా అరవడంతో నోట్లో, ముఖంపై యాసిడ్ పోసి, ఆపై గొంతు కోసి పరారయ్యాడు.
వివరాల్లోకి వెళితే
బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాన్ని అదనుగా చూసుకొని నాగరాజు అనే యువకుడు ఇంట్లోకి వెళ్లాడు. బాలికపై అత్యాచాారానికి ప్రయత్నించాడు. భయాందోళనలకు గురైన బాలిక బాత్రూంలోకెళ్లి తలుపులు వేసుకునే ప్రయత్నం చేసింది.
ఈలోగ మేనమామ నాగరాజు తలుపులు బలంగా తోసి లోపలికి ప్రవేశించాడు. తీవ్రంగా ప్రతిఘటించిన బాలిక నోట్లో, ముఖంపై నిందితుడు యాసిడ్ పోశాడు. యాసిడ్ వల్ల కలిగిన బాధ తట్టుకోలేక బాలిక కేకలు వేయటంతో నిందితుడు కత్తితో గొంతు కోసి బయటికి పరుగులు తీశాడు.
బాధితురాలి కేకలు విన్న స్థానికులు వెంటనే ఆ ఇంట్లోకి వచ్చి చూశారు. రక్తం మడుగులో ఉన్న బాలిక రిషితను నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ముఖంపై యాసిడ్ పోయడంతో చర్మం మొత్తం కాలిపోయింది. గొంతు కోయడంతో ఆమెకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాలిక ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.
బాలిక చెప్పిన సమాచారం మేరకు పోలీసులు నిందితుడు నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేనమామ నాగరాజుని వదిలిపెట్టొద్దని పోలీసులను వేడుకుంది బాలిక. పోలీసులు సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించి, దర్యాప్తు చేపట్టారు.