telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

కాకినాడ ప్రభుత్వాస్పత్రి నుంచి ఖైదీ పరారీ

SIT Investigation YS viveka Murder

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వాస్పత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరారయ్యారు. సామర్లకోట మండలం గూడపర్తిలో జరిగిన హత్యకేసులో బండి సురేష్‌ ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. అతనికి అనారోగ్యంగా ఉండటంతో పోలీసులు అతన్ని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే సురేష్ ఆసుపత్రి నుంచి తప్పించుకున్నాడు. తన భార్య బండి సత్యవతిని హత్య చేసినట్టు బండి సురేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ మేరకు పరారైనా ఖైదీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నగరం నడిఒడ్డున ఉన్న ప్రభుత్వాస్పత్రి నుంచి ఖైదీ పరారవడం సంచలనం రేపింది.

Related posts