తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వాస్పత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరారయ్యారు. సామర్లకోట మండలం గూడపర్తిలో జరిగిన హత్యకేసులో బండి సురేష్ ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. అతనికి అనారోగ్యంగా ఉండటంతో పోలీసులు అతన్ని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే సురేష్ ఆసుపత్రి నుంచి తప్పించుకున్నాడు. తన భార్య బండి సత్యవతిని హత్య చేసినట్టు బండి సురేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ మేరకు పరారైనా ఖైదీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నగరం నడిఒడ్డున ఉన్న ప్రభుత్వాస్పత్రి నుంచి ఖైదీ పరారవడం సంచలనం రేపింది.
previous post
ప్రభుత్వం తనను వేధిస్తోందని కోడెల ఆవేదన చెందేవారు: సుజనా చౌదరి