తెలంగాణలోని నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం తొండ్లాయి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విక్స్ డబ్బా మింగి ఊపిరాడక ఏడు నెలల పసికందు మృతి చెందాడు. బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ విక్స్ డబ్బాను నోట్లో పెట్టుకొని మింగేశాడు. గమనించిన తల్లిదండ్రులు చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళుతుండగానే మార్గం మధ్యలో మృతిచెందాదు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కాగా గొంతులో విక్స్ డబ్బా అడ్డుపడటంతో ఊపిరాడక దారిలోనే ఆ బాలుడు ప్రాణాలొదినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ బిడ్డకు ఇలా జరగడం ఆ తల్లి దండ్రులు తట్టకోలేకపోతున్నారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కేసీఆర్ దొరతనాన్ని ప్రదర్శించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం: విజయశాంతి