telugu navyamedia
తెలంగాణ వార్తలు

సింగరేణిలో 177 క్లరికల్ పోస్టుల భర్తీ..త్వరలోనే నోటిఫికేషన్..

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్న‌ట్లు ఆ సంస్థ డైరెక్ట‌ర్ ఎన్‌.బలరాం వెల్లడించారు.. త్వరలో 177 క్లరికల్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడనుందని ఆ సంస్థ ఎన్‌.బలరాం వెల్లడించారు. అలాగే పారదర్శకంగా రాత పరీక్షలు నిర్వహిస్తామ‌ని అన్నారు.

సోమ‌వారం కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణి ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి అక్రమాలు, ఆరోపణలకు తావులేకుండా రాత పరీక్షను పారదర్శకంగా నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

గతేడాది సింగరేణి సంస్థ సాధించిన నికర లాభం వివరాలను ఈ నెల 25న నిర్వహించనున్న బోర్డు సమావేశంలో ప్రకటించే అవకాశముందని బలరాం తెలిపారు. లాభాల్లో కార్మికుల వాటా విషయమై ముఖ్యమంత్రి, సంస్థ సీఎండీ దసరా లోపు నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.

తమ నుంచి బొగ్గు కొనుగోలు చేసిన వారు వారం లోగా బకాయిలను చెల్లించకుంటే ఏడున్నర శాతం వడ్డీ విధిస్తామని, ఈ రూపంలో సంస్థకు ఏటా రూ.100 కోట్లు అదనంగా లభిస్తుందని తెలిపారు.

Related posts