కొరియోగ్రాఫర్గా, నటుడిగా, దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇండియన్ మైకేల్ జాక్సన్గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా… హీరోగానూ తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. ప్రభుదేవా నటుడిగా ఎంత సక్సెస్ సాధించాడో…కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా కూడా అంతే సత్తా చాటారు.
ఒకప్పుడు పెద్ద హీరోలకు డ్యాన్స్ కంపొంజ్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో ఆయన ఎమ్మెస్ రాజు బ్యానర్లో రెండు సినిమాలు చేశారు. దర్శకుడిగా ప్రభుదేవా గతంలో చేసిన చిత్రాలు ఘోర పరాజయాల్ని మూటగట్టుకున్నాయి.. దీంతో తన దర్శకత్వానికి ఎండ్ కార్డ్ వెయ్యాలని నిర్ణయించుకున్నాడు.
2005లో విడుదలైన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంతో దర్శకుడిగా మారారు ప్రభుదేవా. సిద్ధార్థ్, త్రిష కాంబినేషన్లో తెరకెక్కిన ఆ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆ తరువాత ప్రభాస్తో ‘పౌర్ణమి’ చేశారు. ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. తెలుగు బ్లాక్బస్టర్ చిత్రం’పోకిరి’ ని తమిళం, హిందీ భాషల్లో రీమేక్ చేసి మంచి హిట్ కొట్టారు ప్రభుదేవా.
అలాగే సల్మాన్ ఖాన్తో ఆయన తీసిన ‘దబాంగ్ 3’ ప్లాప్ టాక్ తెచ్చుకోగా.. ఇటీవల రిలీజైన ‘రాధే’ విమర్శలపాలైంది. దాంతో ప్రభుదేవా తిరిగి చెన్నైకు చేరుకున్నారు. ఇకపై దర్శకత్వంవైపు వెళ్లకూడదని నిర్ణయించకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన భగీరా అనే సినిమాలో మెయిన్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు తమిళ్ భాషల్లో విడుదల కానుంది.
పవన్ కు కుదరలేదు కానీ… చిరంజీవి మాత్రం నా మీద పగ తీర్చుకుంటున్నాడు… : శ్రీరెడ్డి కామెంట్స్