telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఆర్టీసీ బస్సులో .. 5 కోట్లు పట్టుకున్న .. ఈసీ ..

ఈరోజు ఏపీ లోని శ్రీకాకుళం జిల్లాలో భారీగా నగదు బయటపడ్డ సంగతి తెలిసిందే. ఓ ఆర్టీసీ బస్సులో మూడు బ్యాగుల నిండా తీసుకెళుతున్న నగదును రాజాం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు తమదేనని ఎవ్వరూ చెప్పకపోవడంతో బస్సులోని 30 మంది ప్రయాణికులను కూడా పోలీసులు స్టేషన్ కు తరలించారు.

ఈ నగదు లెక్కింపును పోలీసులు పూర్తిచేశారు. ఈ మూడు బ్యాగుల్లో కలిపి రూ.5,07,88,000 ఉన్నట్లు తేల్చారు. శ్రీకాకుళం నుంచి పాలకొండకు ఈ నగదును తలరిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే బస్సులో పాలకొండ వైసీపీ నేత కుమారుడు విక్రాంత్ కూడా ఉండటంతో ఆయన్ను పోలీసులు విచారిస్తున్నారు.

Related posts