రాజధాని ఎక్స్ప్రెస్లో పెద్ద మొత్తంలో తరలిస్తున్న గంజాయి పట్టుబడింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పోలీసులు తనిఖీ చేస్తుండగా రూ.20 లక్షల విలువైన 130 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి ఢిల్లీకి తరలిస్తుండగా రైల్వే పోలీసులు సికింద్రాబాద్ వద్ద పట్టుకున్నారు.
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద రూ.20 లక్షల విలువైన 136 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రొసీజర్ ఫాలో అయితే జగన్ ప్రశ్నిస్తున్నారు: యనమల