వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని నేడు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ నెల 30న ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకార చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం తూర్పు గోదావరి, విశాఖ, ప్రకాశం, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు జగన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా జగన్ను కలిశారు.
సీనియర్ అధికారులు ఐజీ సంజయ్, వరప్రసాద్, లక్ష్మీకాంతం, కృష్ణబాబు, సంధ్యారాణి, సత్యనారాయణ జగన్ను కలిశారు. అలాగే ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర, కలెక్టర్లు కార్తికేయ మిశ్రా, ప్రద్యుమ్న, కాటమనేని భాస్కర్ తో పాటు ఎస్పీలు మేరీ ప్రశాంత్, రవిప్రకాశ్ తదితరులు జగన్ను కలిసిన వారిలో ఉన్నారు.