telugu navyamedia
క్రీడలు వార్తలు

చెన్నై అభిమానులకు బ్యాడ్ న్యూస్…

ఐపీఎల్ 2020 ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ లో నుండి ఆ జట్టు కీలక ఆటగాళ్లు సురేష్ రైనా, హర్భజన్ సింగ్ జట్టు నుండి తప్పుకున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు లేకపోవడంతో గత ఏడాది కంటే బ్యాటింగ్ లోను, బౌలింగ్ లోను కొంచెం వెనుకపడిపోయింది. దాంతో ఈ ఏడాది ఐపీఎల్ లో చెన్నై ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడగా అందులో కేవలం 3 మాత్రమే విజయం సాధించింది పౌంట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.

చెన్నై ఇలా వరుస పేలవ ప్రదర్శనలు చేయడంతో నిరాశకు గురవుతున్న ఆ జట్టు అభిమానులకు ఇప్పుడు మరో బ్యాడ్ న్యూస్… అదేంటంటే చెన్నై గత మ్యాచ్ ఢిల్లీతో ఆడినప్పుడు లాస్ట్ ఓవర్ బౌలింగ్ చేయకుండా మైదానం నుండి బయటకు వెళ్లిపోయిన ‘బ్రావో’ కోలుకోవడానికి చాలా సమయం పట్టనున్నట్లు తెలుస్తుంది. ఇది ఆ జట్టుకు గట్టి దెబ్బ అనే చెప్పాలి. ఢిల్లీ తో బ్రావో చివరి ఓవర్ వేయకపోవడంతో ఆ మ్యాచ్ చెన్నై ఓడిపోయింది. అతని స్థానంలో బౌలింగ్ చేసిన జడేజా 18 పరుగులు ఇవ్వడంతో చెన్నై ఆరో ఓటమిని చవిచూసింది. మరి బ్రావో లేకుండా చెన్నై బౌలింగ్ లో ఎలా రాణిస్తుందో చూడాలి.

Related posts