telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ నుంచి తెలంగాణకు 100 బస్సులు

metro slashed RTC in hyderabad

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. గత అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. విధుల్లో చేరని ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ ఆర్మీసీ కార్మికులు సమ్మెను యథాతథంగా కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో పలు ప్రాంతాలకు ఏపీఎస్‌ ఆర్టీసీ అదనపు బస్సులను నడుపుతోంది. కృష్ణా జిల్లా నుంచి అధికారులు తెలంగాణకు 100 బస్సులను పంపారు. విజయవాడ సిటీ సర్వీస్‌లతో పాటు.. ఇతర డిపోల నుంచి కొన్ని సర్వీస్‌లను హైదరాబాద్‌కు నడుపుతున్నామని కృష్ణా జిల్లా ఆర్టీసీ ఆర్‌ఎం నాగేంద్రప్రసాద్ స్పష్టం చేశారు.

Related posts