సెల్ ఫోన్ లో మాట్లాడిన పరిచయంతో యువతిని వేధిస్తున్న ఓ యువకుడిని హైద్రాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు వివరాల్లోకి వెళితే, కూకట్ పల్లి గాజుల రామారం ప్రాంతానికి చెందిన ఓ యువతి (22) ఓ ప్రైవేటు కార్యాలయంలో పనిచేస్తోంది. బెంగళూరులో పనిచేస్తున్న ప్రశాంత్ (24) అనే యువకుడు ఆమెకు సెల్ ఫోన్ లో పరిచయం అయ్యాడు.ఈ క్రమంలో హైదరాబాద్ కు వచ్చిన అతను, తనను కలవాలని, లేకుంటే ఆఫీసుకు వచ్చి గొడవ చేస్తానని బెదిరించాడు.
దీంతో భయపడిన ఆమె, ఓ పార్కులో అతన్ని కలిసేందుకు వెళ్లింది. ఆ సమయంలో అతను అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే, చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. 10వ తేదీన ఆఫీసు వద్దకు వచ్చిన ప్రశాంత్, తోటి ఉద్యోగుల ముందు మరోసారి వేధించాడు. దీంతో ఆందోళనకు గురైన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాడితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.