ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఇస్మార్ట్ శంకర్” గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “ఇస్మార్ట్ శంకర్” చిత్రంలో రామ్ సరసన నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా మణిశర్మ సంగీతం అందించాడు. ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటూ మొదటి రోజు భారీగానే కలెక్షన్లు సాధించింది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. తొలి రోజే ఊహించని కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం రెండో రోజు 25 కోట్ల గ్రాస్ వసూళ్ళు చేసింది. మూడో రోజుకి 36 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి పోటీగా మరో చిత్రం లేకపోవడం, వీకెండ్ కూడా కలిసి రావడంతో ఈ చిత్రం 4వ రోజు ప్రపంచవ్యాప్తంగా 48 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక “ఇస్మార్ట్ శంకర్” అతి త్వరలోనే 50 కోట్లు కొల్లగొడుతుంది. మరో నాల్రోజుల్లో ఈ చిత్రం వంద కోట్లను కొల్లగొడుతుందేమో చూడాలి. రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేశ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 18న గ్రాండ్గా విడుదలైంది. పూరి జగన్నాథ్ స్టైల్ లో సాగే సైంటిఫిక్ మర్డర్ మిస్టరీ చిత్రం కాగా, మెమోరీ ట్రాన్స్ఫర్ అనే కొత్త అంశాన్ని టచ్ చేస్తూ ఈ చిత్రాన్ని హైదరాబాదీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించారు. చాలా రోజుల తర్వాత ఇటు పూరీకి ఇటు రామ్ ఖాతాలో “ఇస్మార్ట్ శంకర్”తో హిట్ పడింది.
previous post
next post