telugu navyamedia
సినిమా వార్తలు

మలేషియాలో “మిస్టర్ కేకే”పై నిషేధం

Mister-KK

తాజాగా విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా చీక‌టి రాజ్యం ఫేమ్ రాజేశ్ ఎం.సెల్వ తెర‌కెక్కించిన చిత్రం “కదరం కొండన్”. ఈ చిత్రాన్ని తెలుగులో “మిస్ట‌ర్ కెకె”గా అనువదించగా… క‌మ‌ల్ హాస‌న్ నిర్మించారు. క‌మ‌ల్ రెండో కుమార్తె అక్ష‌ర హాస‌న్ హీరోయిన్‌గా కీల‌క పాత్ర‌లో న‌టించింది. జూలై 19న ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళం భాష‌ల‌లో విడుద‌ల చేశారు చిత్రబృందం. భారీ ఎక్స్‌పెక్టేషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఈ చిత్రానికి మలేషియాలో చుక్కెదురైంది. మిస్టర్ కేకే చిత్రంలో మలేషియా పోలీసులు, సమాజాన్ని నెగెటివ్ కోణంలో చూపించినట్లు అక్కడి సెన్సార్ బోర్డు పేర్కొంది. ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని భావించిన మలేషియా సెన్సార్ బోర్డు మలేషియాలో చిత్రం విడుదలపై నిషేధం విధించింది. దీంతో విక్రమ్ అభిమానులు సింగపూర్ కు వెళ్లి మరీ సినిమాను చూస్తున్నారట. ఇప్పుడు విక్ర‌మ్ మలమాళం, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న పౌరాణిక చిత్రం మహావీర్‌ కర్ణలో నటిస్తున్నారు. త్వరలో అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.

Related posts