telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యుగానికి ఒక్కడు సీక్వెల్‌తో వస్తున్న ధనుష్‌

పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సినిమా సీక్వెల్‌ను ప్రకటించాడు తమిళ స్టార్ దర్శకుడు సెల్వరాఘవన్. పది సంవత్సరాల క్రితం విడుదలైన ఆయిరతిల్ ఒరువన్ ఈ సినిమా తెలుగులో యుగానికి ఒక్కడుగా తెరకెక్కింది. ఈ సినిమా అప్పట్లో భారీ హిట్ అయింది. దాంతో ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కానీ దర్శకనిర్మాతల నుంచి పదేళ్లుగా ఎటువంటి అప్‌డేట్ లేదు. అటువంటిది దర్శకుడు సెల్వ రాఘవన్ ఈ సినిమా సీక్వెల్ ప్రకటించి అంరికి షాక్ ఇచ్చాడు. ఈ సినిమా మొదటి భాగంలో కార్తీ హీరోగా నటించాడు. ఈ సినిమా తెలుగులో కూడా మంచి స్పందన అందుకుంది. ఈ సినిమా ఇరు భాషల్లో వండర్‌లా నిలిచింది. ఈ సినిమా రెండవ భాగంలో కార్తీ కనిపించడు. ఇందులో ప్రధాన పాత్రగా స్టార్ హీరో ధనుష్ చేయనున్నాడు. అయితే హీరోను మార్చడానికి కథ కారణమా లేదంటే ఇంకేదైన సమస్య అనేదానిపై క్లారిటీ లేదు. ఈ సినిమా పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దీనిని ధనుష్ తన ట్విటర్ ద్వారా షేర్ చేశాడు. ఈ పోస్టర్ చూస్తుంటే మొదటి భాగం అంతం అయిన చోట నుంచే రెండవ భాగం మొదలవుతుందని అర్థం అవుతోంది. మొదటి పార్టులో హీరో కార్తీ చోళ యువరాజు అయిన బాలుడిని శత్రువులైన పాండ్యాల నుంచి కాపాడి భుజాన వేసుకొని అడవుల్లోకి వెళ్లిపోతాడు. అక్కడితో సినిమా ముగుస్తుంది. మరి ఆ బాల యువరాజే సీక్వెల్‌లో హీరో అవుతాడా? అదే జరిగితే.. మొదటి భాగంలో హీరోగా ఉన్న కార్తీ పాత్రను ఎలా ముగిస్తారు? అనేవి ఆసక్తికరమైన అంశాలు. దాంతో ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు పెరుగుతున్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Related posts