త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వీరి కాంబో కోసం నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ గత ఏడాది ఆరంభంలోనే అదిరిపోయే హిట్ అందుకున్నాడు. అలా వైకుంఠపురములో అని అందరిని వైకుంఠపురం తిప్పి చూపించాడు. అటువంటి దర్శకుడు ఈ ఏడాదిని ఎలా ప్రారంభించనున్నాడనేది ఆసక్తిగా మారింది. అయితే త్రివిక్రమ్ నూతన సినిమాలో హీరోగా ఎన్టీఆర్ చేయనున్నాడు. దీనిని ‘అయినను పోయిరావలే హస్తినకు’అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇన్టీఆర్, త్రవిక్రమ్ కలుసుకున్న ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. నూతన సంవత్సర సందర్భంగా వీరు ఇద్దరు కలిపి ఒకరినొకరు విష్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తమ కాంబోలో రానున్న సినిమాపై ఆలోచనలు చేస్తున్నాట్లు తెలుస్తోంది. అయితే న్యూఇయర్ సందర్భంగా నిన్న పవన్ను కలిసిన త్రివిక్రమ్ నేడు ఎన్టీఆర్ను కలవడం మరింత ఆసక్తిని రేపుతోంది. త్వరలో వీరి సినిమాపై కొత్త అప్డేట్ ఇస్తారా అని అందరూ అనుకుంటున్నారు. మరి వారి ఆశలను నెరవేరుస్తూ ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.
previous post