telugu navyamedia
క్రైమ్ వార్తలు

మ‌రికొద్ది గంట‌ల్లో వివాహం.. యువతి ఆత్మహత్య..

*జాజూల కుంట‌లో పెళ్ళింట విషాదం..
*పెళ్ళికి కొన్నిగంట‌ల ముందు  పెళ్ళి కుమార్తె ఆత్మ‌హ‌త్య‌
*పెళ్ళికుమారుడుకి పంపిన మాజీ ప్రేమికుడు..
*యువ‌తి ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మైన యువ‌కుడిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బంధువులు డిమాండ్‌

ఏలూరులో పెళ్ళింట పెను విషాదం చోటుచేసుకుంది. తెల్లారితే పెళ్లి పీటలెక్కాల్సిన యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జాజులకుంటలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. 

కుటుంబ సభ్యులు జంగారెడ్డి గూడెం లక్కవరానికి చెందిన యువ‌కుడితో వివాహం కుదిర్చారు.  నేడు పెళ్లి జరగనుంది. ఇందుకోసం తల్లిదండ్రులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

కాగా.. రాత్రి ఇంట్లో ఉరివేసుకుని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కొంతకాలం క్రితం ఆమె ఓ యువకుడిని ప్రేమించింది. అనంతరం వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు.

యువతి వివాహ విషయాన్ని తెలుసుకున్న యువకుడు.. ఆమెతో కలిసి ఉన్న ఫోటోలను పెళ్ళి కుమారుడుకు పంపించాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Related posts